చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కి చెందిన ముఖ్య మంత్రి సహాయ నిధి

Spread the love

Chief Minister’s Relief Fund of Vemukunta under Chandanagar Division

సాక్షిత : చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కి చెందిన ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF ) ద్వారా మంజూరైన 4,50,000 /- నాలుగు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం లో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,

శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , హమీద్ పటేల్ , జగదీశ్వర్ గౌడ్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF -చెక్కుల వివరాలు

1.చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కి చెందిన ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF ) ద్వారా మంజూరైన 4,50,000 /- నాలుగు లక్షల యాబై వేల రూపాయలుగా మంజూరిఅయినవిఅని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ పునరుద్గాటించారు .

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని..

ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ వైద్య చికిత్స కోసం సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని బాధితురాలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page