భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం

Spread the love

భూమన అభినయ్ నే ఎమ్మెల్యేగా చేద్దాం

  • తిరుపతి బలిజలంతా భూమనతోనే సాక్షిత, తిరుపతి బ్యూరో: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు, యువనేత భూమన అభినయ్ రెడ్డినే ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతామని వైసీపీ బలిజ నాయకులు ప్రకటించారు. ఈమేరకు తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, చిన్న పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ దుద్దేలబాబు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు వెంకటేష్, నీలం అనిల్, చంద్రశేఖర్, చిన్నముని, ప్రవీణ్, మహిళా కార్పొరేటర్లు సునీత, గంగమ్మ గుడి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు రమణమ్మ, భారతి తదితరులు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలోని బలిజలంతా ఎప్పటికీ భూమన కుటుంబానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఎందుకంటే వైకాపాను నమ్ముకొన్న బలిజలందరికీ పదవులిచ్చిన గొప్ప నేత భూమన అని ప్రశంసించారు. అందుకే బలిజలంతా వైకాపా వైపు ఉంటామని స్పష్టం చేశారు. అంతేగాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ, సేవా కార్యక్రమాల ముందు ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయని వ్యాఖ్యానించారు. దీనిని తట్టుకోలేని జనసేన నేతలు వైకాపా బలిజలను బానిసలుగా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారని విమర్శించారు. జనసేన పార్టీలో తిరుమల శ్రీవారి టికెట్లు అమ్ముకోడానికే జనసైనికులుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సర్వేలో గతంలో రెండు చోట్ల ఓడిపోయానని, ఈసారి తిరుపతిలో సర్వే చేయిస్తే కచ్చితంగా వైకాపాతో ఓడిపోతామని గ్రహించి మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకు తిరుపతిలోని 90 శాతం బలిజలు అంతా వైకాపా వైపు ఉండడం కారణమన్నారు. ఇప్పటికైనా జనసేన నేతలు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page