ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్

Spread the love

ప్రయాణీకుల ఆదాయంలోమొదటిసారిగా చరిత్ర రూ.5,000 కోట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్
*సాక్షిత సికింద్రాబాద్ : దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో రూ.5000కోట్ల ఆదాయాన్నిఆర్జించిఒక ప్రధాన మైలురాయిని సాధించింది.జోన్ లో ప్రయాణీకుల ద్వారా రూ.5,000.81కోట్లు ఆర్జించింది.ఇది 2019-20లో నమోదైన ఉత్తమ ఆదాయము రూ.4,119.44 కోట్ల కంటే రూ.881.37కోట్లుఅధికం అనగా 21% ఎక్కువ. వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమిష్టి కృషి వలన జోన్‌లోని ప్యాసింజర్ సెగ్మెంట్‌లో ఈ కొత్త మైలురాయిచేరుకునేందుకు సాధ్యమైంది, కొన్ని రైళ్లలో నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, జోన్ పరిధిలోని వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోశాశ్వతంగా 200 కోచ్‌లను పెంచింది, ఫలితంగా ఈ రైళ్లకుఅధిక ఆదరణ లభించింది.

అదనంగా,ప్రయాణీకుల సీజనల్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రస్తుత సంవత్సరంలో 200 అదనపు కోచ్‌లను కూడా తాత్కాలికంగా పెంచారు,వాస్తవానికి ప్రయాణీకుల డిమాండ్‌ను రోజువారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తారు మరియు అదనపు డిమాండ్‌ను తీర్చడానికి సాధ్యమైన చోట అదనపు కోచ్‌లు జత చేస్తారు.వెయిట్‌లిస్ట్ చేసిన ప్రయాణీకులను క్లియర్ చేయడానికి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్‌లు జతచేయబడ్డాయి దీని కారణంగా 9,83,559 మంది ప్రయాణికులు అదనంగాబెర్త్‌లను పొందారు, ఫలితంగా రైల్వేలకు రూ.81.28 కోట్ల అదనపుఆదాయం వచ్చింది.

అదేవిధంగాపండుగలు మరియు సెలవుల వేళల్లో ప్రయాణీకుల నుండి అదనపుడిమాండ్‌ను తీర్చడానికి, దసరా, దీపావళి, శబరిమలై, క్రిస్మస్/న్యూ ఇయర్, సంక్రాంతి,హోలీఇలా మొదలైన పండుగలకు దక్షిణ మధ్య రైల్వే 3,543 ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా 30.42 లక్షలమందిప్రయాణికులనువివిధగమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.219.80 కోట్లు అదనపుఆదాయంలభించింది.ఈఏడాదికొత్తగారైళ్లను ప్రవేశపెట్టడం కూడా ఎంతో లబ్ది చేకూరింది, ముఖ్యంగా వందే భారత్ రైలు సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య ప్రవేశపెట్టడం భారతీయ రైల్వేలకు గర్వకారణంఅంతేకాకుండా కాచిగూడ-మెదక్,అకోలా-అకోట్ మరియు బీదర్-కలబురగి మధ్య ఏడు జతల కొత్త రైలు సర్వీసులు ప్రవేశపెట్ట బడ్డాయి.నాందేడ్-పూణె-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఫ్రీక్వెన్సీని పెంచడం అనగా రెండు వారాలకు ఒక సారి ప్రయాణించే ఈ రైలు ఇప్పుడుప్రతిరోజనడిచేలాచర్యలుతీసుకున్నారు.ప్రయాణీకుల సౌకర్యం కోసంఎనిమిది జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎల్ హెచ్ బిరేక్‌లుగా మార్చడం జరిగింది


ఈ సందర్బంగాదక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కోట్ల ప్రయాణీకుల ఆదాయాన్ని నమోదు చేసినందుకుదక్షిణమధ్యరైల్వేసిబ్బందినిఅభినందించారు.వివిధశాఖలమధ్యపటిష్టమైన సమన్వయం మరియు అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం లభించిందని ఆయన పేర్కొన్నారు.జోన్ అత్యుత్తమ పనితీరును సాధించడంలో మరియు ఈ ప్రీమియర్ జోన్‌ను నడిపించడంలో ఇది ఎంతోసంతృప్తిని ఇస్తుందన్నారు.ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చడానికి జోన్ ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తుందని,మరియు వారి ప్రయాణ అవసరాలనుతీర్చడానికిఅవసరమైనఅన్ని చర్యలను కొనసాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సిహెచ్.రాకేష్ పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page