
తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ విప్గా తనను ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ, “నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్ కి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పార్టీ ఆదేశాలను పాటిస్తూ, శాసనసభలో పార్టీ ప్రతిష్టను మరింత పెంచేలా పని చేస్తాను” అని పేర్కొన్నారు.
అలాగే, పార్టీ నాయకత్వం తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని, పార్టీ అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షల నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app