15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర

Spread the love

15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”

పాదయాత్రలో భాగంగా.. పత్తిచేలో పనిచేసుకుంటున్న రైతు కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్

అయ్యా… మావి రెక్కాడితే గానీ, డొక్కాడని బతుకులు. మా ముసలోళ్ళకి కొంతమందికి పింఛన్లు కూడా రావడం లేదు- ఓ వృద్ధ కూలీ

మేము చాలా పేదోళ్లం… మాకు కనీసం ఇండ్లు కూడా లేవు. నిత్యావసర ధరలు అందుబాటులో లేవు. బతకడం భారంగా మారింది – ఓ మహిళా కూలీ

పేదలను పట్టించుకునే ప్రభుత్వాలు రావాలి

ఎవరు అధికారంలోకి వచ్చినా… పేదోళ్లను మాత్రం పట్టించుకోవడం లేదు.

మేము చేసిన పనులకు నిధులు మంజూరు కాక కూలిపనులకు వచ్చి, కూలి పనులు చేసుకుంటున్నాం – బండి సంజయ్ తో చీటూరు గ్రామ సర్పంచ్ భార్య

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే… పాదయాత్ర చేస్తున్నాను – బండి సంజయ్

మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై పోరాటం చేస్తాం – బండి సంజయ్

బిజెపి ప్రభుత్వం వచ్చాక, మీకు అండగా ఉంటాం… మిమ్మల్ని ఆదుకుంటాం – బండి సంజయ్

Related Posts

You cannot copy content of this page