అల్లాపూర్ డివిజన్ లోని పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అల్లాపూర్ డివిజన్ లోని పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ పరిధిలోని

1) పర్వత్ నగర్ లో జీవో 59 కింద 10% అమౌంట్ కట్టినవారికి రెగ్యులరైజేషన్ చేయాలని,

2) సర్వే నంబర్ 18 లో తెలుగు, ఇంగ్లీష్, మరియు ఉర్దూ, మీడియం హై స్కూల్ నిర్మాణం కొరకు,

3) డివిజన్ లోని పలు బస్తీలలో అంగన్వాడి సెంటర్ల కొరకు,

4) ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల కొరకు, కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే కలెక్టర్ స్పందించి స్థానిక ఎమ్మార్వో, విద్యాధికారులకు, తగిన సర్వే చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Related Posts

You cannot copy content of this page